జల సంరక్షణ.. ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2021-03-05T06:00:05+05:30 IST
జల సంరక్షణలో భాగంగా భూగర్భ జలాలను పెంపొందించడంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువసమన్వయ అధికారి దేవిరెడ్డి కిరణ్మయి తెలిపారు.
గుంటూరు(తూర్పు), మార్చి 4: జల సంరక్షణలో భాగంగా భూగర్భ జలాలను పెంపొందించడంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువసమన్వయ అధికారి దేవిరెడ్డి కిరణ్మయి తెలిపారు. క్యాచ్ది రైన్ ప్రాజెక్ట్లో భాగంగా ఎంపిక చేసిన యువజన సంఘాలతో జల పరిరక్షణ అనే అంశంపై గురువారం స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో వెబినార్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటిని మనం మాత్రమే వృథా చేయకూడదు అనే విధానాన్ని వీడి, చుట్టుపక్కల వారికి కూడా నీటి ప్రాధాన్యం గురించి వివరించాలన్నారు. జిల్లా వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్షాధార నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సదస్సులో వినుకొండ, వెల్దుర్తి, బొల్లాపల్లి మండలాల యువజన సంఘాలు, వలంటీర్లు పాల్గొన్నారు.