యూటీఎఫ్ నేత మహమ్మద్ గౌస్ మృతి
ABN , First Publish Date - 2021-04-22T05:09:54+05:30 IST
యూటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మహమ్మద్గౌస్ అనారోగ్యంతో బుధవారం చందోలులో మృతి చెందారని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు (విద్య), ఏప్రిల్ 21: యూటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మహమ్మద్గౌస్ అనారోగ్యంతో బుధవారం చందోలులో మృతి చెందారని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్కుమార్; కళాధర్, కె.నాగమల్లేశ్వరరావు, ఎం.హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు. మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడమే కాకుండా ఉపాధ్యాయుల సమస్యలపై పలు పోరాటాలు చేశారని పేర్కొన్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, సజ్జావారిపాలెం, డోకిపర్రు, చల్లావారిపాలెం తదితర పాఠశాలల్లో పనిచేసి అక్కడ అభివృద్ధికి కృషిచేశారని తెలిపారు.