ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
ABN , First Publish Date - 2021-03-03T05:50:35+05:30 IST
కృష్ణా- గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలకుడు కేవీ రమణ పరిశీలించారు.
గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణా- గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలకుడు కేవీ రమణ పరిశీలించారు. బుధవారం ఆయన తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు నగరం, రూరల్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను చూశారు. అనంతరం రోడ్లు, భవనాల అతిథిగృహంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మధ్యాహ్నం ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాలకు వెళ్లి పోలింగ్ బూత్లను సందర్శించి పలు సూచనలు చేశారు. జేసీ (ఆసర) కె.శ్రీధర్రెడ్డి, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ నిరంజన్రెడ్డి, తహసీల్దార్ మోహన్రావు, డీటీ రమేష్ పాల్గొన్నారు.