టీడీపీలో చంద్రబాబు చీడపురుగు: Maddali giri
ABN , First Publish Date - 2021-10-22T19:54:06+05:30 IST
కేంద్ర కార్యాలయం మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడిన మాటలు స్వతంత్ర దేశంలో ఎవరూ మాట్లాడలేదని ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు.
గుంటూరు : టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియా సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పట్టాభి మాట్లాడిన మాటలు స్వతంత్ర దేశంలో ఎవరూ మాట్లాడలేదని ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ఇవాళ గుంటూరులో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. టీడీపీలో చంద్రబాబు చీడపురుగని వ్యాఖ్యానించారు. చంద్రబాబే స్క్రిప్ట్ రాసి పట్టాభి చేత మాట్లాడించారని ఆరోపించారు. మాటలు హద్దులు దాటడం వలనే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వచ్చాయన్నారు.
టీడీపీ నైజాన్ని ఆరేళ్ళ పాటు గమనించానని తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలను ఎలా ఆపలా అని ప్లాన్స్ వేస్తుంటారని మండిపడ్డారు. గురువారం కాగానే నలభై మంది లాయర్లతో సమావేశమై ఏ పథకాన్ని ఎలా ఆపలా అని చంద్రబాబు ఆలోచన చేస్తారన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎలా దుర్భాషలాడారో చూశామని ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు.