36,217 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2021-10-30T04:45:46+05:30 IST
మిర్చియార్డుకు శుక్రవారం 34,943 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 36,217 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం 34,943 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 36,217 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 10,844 టిక్కీలు నిల్వ ఉన్నాయి. శుక్రవారం యార్డులో నాన ఏసీ కామన వెరైటీలు క్వింటాల్కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.11,500, నాన ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.14,500, నాన ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,900, ఏసీ కామన్ వెరైటీకి రూ.7,000, రూ.11,500, ఏసీ స్పెషల్ వెరైటీకి రూ.7,000, రూ.15,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.