28,063 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2021-05-13T06:02:37+05:30 IST
మిర్చియార్డు పరిధిలోని కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లకు బుధవారం 24,639 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 28,063 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 2,974 టిక్కీలు నిల్వ ఉన్నాయి.

గుంటూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డు పరిధిలోని కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లకు బుధవారం 24,639 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 28,063 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 2,974 టిక్కీలు నిల్వ ఉన్నాయి. బుధవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్కు కనిష్టంగా రూ.6,000, గరిష్టంగా రూ.12,500, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.6,500, రూ.13,500, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.4,500, రూ.8,500 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.