87,642 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2021-01-21T05:01:16+05:30 IST
మిర్చియార్డుకు బుధవారం మొత్తం 82,512 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 87,642 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు బుధవారం మొత్తం 82,512 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 87,642 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 96,587 టిక్కీలు నిల్వ ఉన్నాయి. బుధవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్కు కనిష్ఠంగా రూ.6,000, గరిష్ఠంగా రూ. 16,000, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ. 7,000, రూ. 18,000, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ. 5,000, రూ. 8,000 ధర లభించింది. ఏసీ కామన్ వెరైటీలకు రూ. 7,500, రూ. 13,500, ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ. 6,500, రూ. 18,000, ఏసీ తెల్లకాయలకు రూ. 4,500, రూ. 7,300 ధర లభించినట్లు సెక్రెటరి ఎం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.