వేద పాఠశాల విద్యార్థుల మృతి బాధాకరం: మంత్రి Vellampalli
ABN , First Publish Date - 2021-12-11T16:36:17+05:30 IST
కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
గుంటూరు: కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం జీజీహెచ్లో విద్యార్థుల మృతదేహాలను వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహార్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నానానికి దిగిన సమయంలో నీటిలో పడిపోయిన ఒక విద్యార్దిని కాపాడే ప్రయత్నంలో ఘటన జరిగిందన్నారు. శృంగేరి పీఠం అధికారులతో మాట్లాడానని... ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ...ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో వేద పాఠశాల మృతి చెందిన ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులు సాయంత్రానికి గుంటూరు చేరుకుంటారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.