రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-01-18T05:18:04+05:30 IST
పండుగకు బంధువుల ఊరికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు - మాచర్ల రహదారిలో చౌటపాపాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.
రాజుపాలెం, జనవరి17: పండుగకు బంధువుల ఊరికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు - మాచర్ల రహదారిలో చౌటపాపాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం మండలం మల్లవోలుకు చెందిన బండి పుష్పావతి(37), భర్త పేర్రాజు, పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగకు బంధువుల ఊరు వరగాని వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా చౌటపాపాయపాలెం దాటిన తర్వాత వెనుక వస్తున్న టిప్పర్ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఘటనలో పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.