హింసకు గురవుతున్న 80 శాతం మహిళలు
ABN , First Publish Date - 2021-12-29T05:07:22+05:30 IST
సమాజంలో 80శాతం మహిళలు నిత్యం హింసకు గురవుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
![హింసకు గురవుతున్న 80 శాతం మహిళలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122811362140/12282021233638n89.gif)
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ
గుంటూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సమాజంలో 80శాతం మహిళలు నిత్యం హింసకు గురవుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వివాహిత హక్కులు - గృహహింస చట్టంపై మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలు దిశయాప్ ద్వారా రక్షణ పొందాలన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జీవీ కృష్ణయ్య మాట్లాడుతూ దిశాయాప్, గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయటం శుభపరిణామం అన్నారు. సమావే శంలో మహిళా కమిషన్ డైరెక్టర్ సూయజ్, జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, మహిళా ప్రాంగణం మేనేజర్ కృష్ణవేణి, మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహహింస చట్టం అవగాహనపై పోస్టర్లను ఆవిష్కరించారు.