61 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-10-24T04:50:13+05:30 IST
జిల్లాలో కొత్తగా 61 మంది కరోనా బారిన పడ్డారు.
గుంటూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 61 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం ఉదయం వరకు 1,961 శాంపిల్స్ టెస్టింగ్ జరగగా 3.11 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ నుంచి 27 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 608కి చేరింది. కరోనాతో ఆరోగ్యం విషమించి బాపట్లలో ఒకరు మృతి చెందారు. శనివారం గుంటూరులో 27, తెనాలిలో 5, రేపల్లెలో 3, మంగళగిరిలో 3, మాచర్లలో 3, నరసరావుపేటలో 3, చిలకలూరిపేటలో 2, చేబ్రోలులో 2, మేడికొండూరులో 2, తాడేపల్లిలో 2, పెదకాకానిలో 1, ప్రత్తిపాడులో 1, సత్తెనపల్లిలో 1, తాడికొండలో 1, తుళ్లూరులో 1, ఫిరంగిపురంలో 1, దాచేపల్లిలో 1, నాదెండ్లలో 1, కర్లపాలెంలో 1 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు అధికారి డాక్టర్ టీ జయసింహ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా శనివారం 36,964 మందికి తొలి డోసు, 19,819 మందికి రెండో డోసు టీకాలు వేశారు.