రొయ్యలు, చేపల సాగుకు లైసెన్స్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-02-02T05:20:01+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాల ప్రకారం ఆ్వకా రైతులు రొయ్యల, చేపల సాగుకు విధిగా లైసెన్సులు పొందాలని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

మత్స్యశాఖాభివృద్ధి అదికారి ఎన్.వెంకటేశ్వరరెడ్డి
కర్లపాలెం, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాల ప్రకారం ఆ్వకా రైతులు రొయ్యల, చేపల సాగుకు విధిగా లైసెన్సులు పొందాలని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం జీవోనెంబరు7 జారీ చేసిందన్నారు. రొయ్యపిల్లలను, చేపపిల్లలను ఉత్పత్తి చేసే హెచరీలు కూడా తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలన్నారు. లైసెన్స్ల కోసం సంబంధిత గ్రామ మత్స్యశాఖ సహాయకుల ద్వారా ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.