కాకాని శివన్న హుండీ ఆదాయం రూ.41 లక్షలు
ABN , First Publish Date - 2021-03-25T05:19:34+05:30 IST
పెదకాకాని శివాలయంలో బుధవారం హుండీలెక్కింపు జరిగింది. కార్యక్రమాన్ని దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.

పెదకాకాని, మార్చి 24: పెదకాకాని శివాలయంలో బుధవారం హుండీలెక్కింపు జరిగింది. కార్యక్రమాన్ని దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. రూ.41,02,158 నగదు, 30.30 గ్రాముల బంగారం, 409-400 గ్రాముల వెండి, అమెరికా (28 డాలర్లు), మలేషియా (1), కెనడా (5), అస్ట్రేలియా (5) కరెన్సీ హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ శ్యామల రఘునాథరెడ్డి తెలిపారు. నగదు లెక్కింపులో ఓ మహిళ రూ.500 నోట్లు 22, వంద నోటు ఒకటి మొత్తం రూ. 11,100లను తను ధరించిన చీరలో దాచినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను పెదకాకాని పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు రఘునాధరెడ్డి తెలిపారు.