Janasena నేతలపై పోలీసులు ఉక్కుపాదం!
ABN , First Publish Date - 2021-07-20T13:38:13+05:30 IST
జనసేన నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.!
గుంటూరు : జనసేన నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.! నిరుద్యోగులకు అండగా నేడు ఉపాధి కార్యాలయంలో వినతి పత్రం అందజేయాలని జనసేన భావించింది. అయితే ఇంటి బయటికి వస్తే కేసులు పెడతామంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. పోలీసులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు..? అని ఖాకీల తీరు పట్ల జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత వారం రోజులుగా జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ చలో తాడేపల్లి, సీఎం ఇంటి ముట్టడికి పిలుపిచ్చిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి కార్యక్రమాన్ని భగ్నం చేసిన విషయం విదితమే.
Notice లో ఏముంది..?