ఇండోర్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2021-07-19T05:22:02+05:30 IST

భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం జలమయం కావడంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని ఇండోర్‌ స్టేడియంకి మార్చారు.

ఇండోర్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌  ర్యాలీ
రిక్రూట్‌ మెంట్‌కు హాజరైన అభ్యర్థులు

గుంటూరు, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం జలమయం కావడంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని ఇండోర్‌ స్టేడియంకి మార్చారు. ఆదివారం రిక్రూట్‌ మెంట్‌కు హాజరైన అభ్యర్థులకు పరుగుపోటీని స్థానిక పొన్నూరు రోడ్డులోని ఏపీసీపీడీసీఎల్‌ కార్యాలయం వద్ద నుంచి డంపింగ్‌యార్డు వరకు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి ఇండోర్‌ స్టేడియంలో శరీర, దారుఢ్య పరీక్షలకు అనుమతించారు. మొత్తం 3,462 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2,735 మంది ర్యాలీకి వచ్చినట్లు ఆర్మీ రిక్రూటింగ్‌ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా స్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన షామి యానాలు, లైటింగ్‌లు నేలకూలిపోయా యి. వెంటనే అధికార యంత్రాంగం అప్రమ త్తమై సౌకర్యాలను పునరుద్ధరించి రిక్రూట్‌ మెంట్‌ ప్రక్రియకి ఆటంకం లేకుండా చేసినట్లు స్టెప్‌ సీఈవో వెల్లడించారు.

Updated Date - 2021-07-19T05:22:02+05:30 IST