కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2021-06-20T05:54:53+05:30 IST
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.
హోం మంత్రి సుచరిత
గుంటూరు, జూన్ 19: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. స్వర్ణభారతినగర్లో వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులతో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. వాహన మిత్ర పథకంలో భాగంగా మూడో విడతగా రూ..10వేలు డ్రైవర్లకు అందించిన సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు ఉన్నారు.