జోగి రమేష్ డ్రైవర్ ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-09-18T17:55:57+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1), 3(2) కింద, ఐపీసి 144, 148, 149, 188, 269, 270, 294బి, 341, 352, 427, 506 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.