గుంటూరులో వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-22T15:50:27+05:30 IST
జిల్లాలోని తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది.
![గుంటూరులో వివాహిత ఆత్మహత్య](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032210035525/03222021102022n86.jpg)
గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. పూర్ణకంటి సాహితి(18) అనే యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే సాహితికి వివాహం జరిగింది. భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.