ఫెన్సింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-10-27T05:16:10+05:30 IST
స్థానిక ఉమెన్స కాలేజీలో మంగళవారం జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గుంటూరు(తూర్పు), అక్టోబరు 26: స్థానిక ఉమెన్స కాలేజీలో మంగళవారం జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బొర్రా నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. పోటీల్లో పాఠశాలకు చెందిన క్రీడాకారుల 10 బంగారు, 11 వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ జిలానీబాషా, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్లు ప్రత్యేకంగా అభినందించారు.