ఉద్యమం ఉధృతం చేస్తాం

ABN , First Publish Date - 2021-12-09T05:48:25+05:30 IST

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఉద్యమం ఉధృతం చేస్తాం
బస్టాండ్‌ ఎదుట ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు

జీజీహెచ్‌, ఆర్టీసీ బస్టాండ్‌వద్ద ఉద్యోగ సంఘాల నిరసన

గుంటూరు, డిసెంబరు 8: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండోరోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆయా ఉద్యోగ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న జేఏసీ జిల్లా చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ కె.సంగీతరావు, జేఏసీ కన్వీనర్‌ సతీష్‌కుమార్‌, ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్‌ శ్రీనివాసశర్మ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ క్లాస్‌ ఫోర్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, నర్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బి.శైలజ, యూనిట్‌ అధ్యక్షులు ఆశాజ్యోతితోపాటు ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్‌ యూనియన్‌  నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు, జీజీహెచ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-09T05:48:25+05:30 IST