మెడికల్‌ కళాశాలకు.. రూ.475 కోట్లకు పరిపాలన ఆమోదం

ABN , First Publish Date - 2021-03-24T05:42:37+05:30 IST

బాపట్లలో మెడికల్‌ కళాశాలతోపాటు నర్సింగ్‌ కళాశాల, 500పడకల ఆసుపత్రి నిర్మాణాలకు రూ.475కోట్ల పరిపాలన ఆమోదం లభించినట్లు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తెలిపారు.

మెడికల్‌ కళాశాలకు..  రూ.475 కోట్లకు పరిపాలన ఆమోదం
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీస్పీకర్‌ కోన రఘుపతి

డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి 

బాపట్ల, మార్చి 23 : బాపట్లలో మెడికల్‌ కళాశాలతోపాటు నర్సింగ్‌ కళాశాల, 500పడకల ఆసుపత్రి నిర్మాణాలకు రూ.475కోట్ల పరిపాలన ఆమోదం లభించినట్లు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తెలిపారు. మంగళవారం బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పది రోజుల్లో దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అత్యాధునికంగా నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు చొరవ తీసుకొని మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-03-24T05:42:37+05:30 IST