పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ
ABN , First Publish Date - 2021-09-03T14:39:23+05:30 IST
మండలంలోని పూండ్ల గ్రామంలో..

బాపట్ల టౌన్: మండలంలోని పూండ్ల గ్రామంలో సంగండెయిరీ పాల సొసైటీ లో 67మంది పాల ఉత్పత్తిదారులకు రూ.2.52 లక్షల రూపాయలను బోనస్ అందజేశామని సంగండెయిరీ డైరెక్టర్ మరీదు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెయిరీ మేనేజర్ కట్రా నరేష్బాబు పాల్గొని రైతులకు అందించే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. కార్యక్రమంలో డెయిరీ సూపర్వైజర్ ఉప్పాల సందీప్కృష్ణ, పూండ్ల నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రావిపాటి రవి, ఆర్ఎన్వీ సత్యనారాయణ, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.