క్వారంటైన్ సెంటర్ నుంచి 29 మంది డిశ్చార్జి
ABN , First Publish Date - 2021-05-15T06:10:26+05:30 IST
తాడేపల్లి మండలం గుండిమెడలోని క్వారంటైన్ సెంటర్ నుంచి శుక్రవారం 29మంది కొవిడ్ పేషెంట్లు డిశ్చార్జిఅయ్యారు.
తాడేపల్లి, మే14: తాడేపల్లి మండలం గుండిమెడలోని క్వారంటైన్ సెంటర్ నుంచి శుక్రవారం 29మంది కొవిడ్ పేషెంట్లు డిశ్చార్జిఅయ్యారు. మొత్తం 53మంది జాయిన్ కాగా, నలుగురిని అత్యవసర వైద్యసేవల నిమిత్తం వివిధ వైద్యశాలలకు తరలించారు. ఇప్పటివరకు 392మంది గుండిమెడ క్వారంటైన్ సెంటర్లో చేరగా, 92 మంది డిశ్చార్జి అయ్యారు. క్వారంటైన్ సెంటర్కు శుక్రవారం తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి విచ్చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి ఆర్.శ్రీనివాసరావు, గుండిమెడ గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.