ఏబీసీడీ అవార్డుకు సైబర్‌ కేసు

ABN , First Publish Date - 2021-02-06T05:26:32+05:30 IST

ప్రతీ యేటా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేఽధించిన ముఖ్యమైన కేసులకు ఇచ్చే ఏబీసీడీ అవార్డుకు ఈ సారి గుంటూరు అర్బన్‌ జిల్లా ఎంపికైంది.

ఏబీసీడీ అవార్డుకు సైబర్‌ కేసు
డీజీపీ నుంచి ఏబీసీ అవార్డు తీసుకుంటున్న అర్బన్‌ పోలీసులు

సోషల్‌ మీడియాలో యువతి నగ్నచిత్రాల కేసుకు డీజీపీ  ప్రశంసలు

గుంటూరు, ఫిబ్రవరి 5: ప్రతీ యేటా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేఽధించిన ముఖ్యమైన కేసులకు ఇచ్చే ఏబీసీడీ అవార్డుకు ఈ సారి గుంటూరు అర్బన్‌ జిల్లా ఎంపికైంది. ఓ యువతి నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఘటనపై గతేడాది మహిళా స్టేషన్‌లో నమోదైన కేసును  అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, దిశ డీఎస్పీ లక్ష్మీనారాయణలు ఛేదించారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అర్భన్‌, టెక్నికల్‌ అనాల్సిస్‌ టీమ్‌ ఇన్‌చార్జిగా పని చేసిన విశ్వనాథ్‌రెడ్డి,  ఏఎస్‌ఐలు కోటయ్య, బాజీబాబు, సిబ్బందిని డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రశంసించారు. శుక్రవారం మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆయా అధికారులు, సిబ్బందికి అవార్డులు అందించి అభినందించారు. 

 

Updated Date - 2021-02-06T05:26:32+05:30 IST