78 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-10-21T05:38:48+05:30 IST
జిల్లాలో కొత్తగా 78 మందికి కరోనా వైరస్ సోకింది.

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 78 మందికి కరోనా వైరస్ సోకింది. బుధవారం ఉదయం వరకు 2,335 శాంపిల్స్ టెస్టింగ్ జరగ్గా 3.34 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ నుంచి 44 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 611కి చేరింది. గుంటూరులో 26, చిలకలూరిపేటలో 6, నరసరావుపేటలో 5, తాడికొండలో 5, మంగళగిరిలో 3, పొన్నూరులో 3, రేపల్లెలో 3, తెనాలిలో 3, మేడికొండూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, బాపట్ల, కాకుమాను, మాచర్ల, రెంటచింతల, బాపట్ల, కాకుమానులో రెండేసి, పిడుగురాళ్ల, అమరావతి, గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, నకరికల్లు, రొంపిచర్ల, భట్టిప్రోలు, కర్లపాలెం, నగరం, పిట్టలవానిపాలెంలో ఒక్కొక్కరికి పాజిటివ్గా నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి టీ జయసింహ తెలిపారు. బుధవారం 24,388 మందికి తొలి డోసు, 21,484 మందికి రెండో డోసు టీకా వేసినట్లు తెలిపారు.