39 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-30T05:08:57+05:30 IST

జిల్లాలో కొత్తగా 39 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

39 మందికి కరోనా

గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 39 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. శుక్రవారం ఉదయం వరకు 2,108 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 1.85 శాతం మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉండి 16 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసులు 341కి తగ్గాయి. కొత్తగా గుంటూరులో 19, తెనాలిలో 4, మంగళగిరిలో 3, నరసరావుపేటలో 3, దుగ్గిరాలలో 3, వట్టిచెరుకూరులో 2, సత్తెనపల్లిలో 1, తాడేపల్లిలో 1, దాచేపల్లిలో 1, చిలకలూరిపేటలో 1, చెరుకుపల్లిలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ టీ జయసింహ తెలిపారు. కొత్తగా 34,811 మందికి తొలి డోసు వేయడంతో ఇప్పటివరకు కనీసం ఒక్క డోసు టీకా చేయించుకున్న వారి సంఖ్య 33 లక్షల 29 వేల 840కి చేరింది. శుక్రవారం 19,349 మంది రెండో డోసు చేయించుకోగా మొత్తం సంఖ్య ఇప్పటి వరకు 14 లక్షల 85 వేల 627కి చేరింది. 


Updated Date - 2021-10-30T05:08:57+05:30 IST