జిల్లాలో 17 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-02-27T05:26:42+05:30 IST

ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో శుక్రవారం ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాలో 17 మందికి కరోనా

గుంటూరు(మెడికల్‌), ఫిబ్రవరి 26: ఇటీవల కరోనా  తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో శుక్రవారం ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరంలో 8, గుంటూరు రూరల్‌, మంగళగిరిలో రెండేసీ, అచ్చంపేట, తాడేపల్లి, దాచేపల్లి, చేబ్రోలు, తెనాలిలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. అచ్చంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చి నట్లు స్థానిక వైద్యులు తెలి పారు. చిత్తూరు తర్వాత మన జిల్లాలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రజలు బహిరంగ ప్రాంతాలకు వచ్చే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ కోరారు. 73 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 2563 మందికి తొలి విడత టీకా మందు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొదటి విడత  వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 50,080కి చేరింది. కాగా 35 కేంద్రాల్లో నిర్వహించిన రెండో విడత డ్రైవ్‌లో 507 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెం డో విడత వ్యాక్సిన్‌ పొందిన వారి సంఖ్య 10178కి చేరినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 

Updated Date - 2021-02-27T05:26:42+05:30 IST