సోమ, మంగళవారాల్లో నీటి సరఫరా బంద్‌

ABN , First Publish Date - 2021-04-18T05:34:02+05:30 IST

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, విలీన గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

సోమ, మంగళవారాల్లో నీటి సరఫరా బంద్‌

గుంటూరు(కార్పోరేషన్‌) ఏప్రిల్‌ 17: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, విలీన గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 19 ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ పంప్‌ సెట్స్‌, వాల్వ్‌లు మరమ్మత్తులు చేయనున్నట్లు కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. అందువల్ల 19న సాయంత్రం, 20వ తేదీ ఉదయం, సాయంత్రం పశ్చిమ నియోజకవర్గంలోని 25, 28, 29, 30, 31, 33, 34, 35, 36, 38, 39, 42, 43, విలీన గ్రామాలలోని 40, 41, 46, 47, 48 డివిజన్లలో నీటి సరఫరా ఉండదన్నారు. హెచ్‌ఎల్‌ఆర్‌, గుజ్జనగుండ్ల, శ్యామలానగర్‌, స్తంభాల గరువు, హౌసింగ్‌ బోర్డు కాలనీ, కొండా వెంకటప్పయ్య కాలనీ, మిర్చియార్డు తదితర ప్రాంతాలకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. 


Updated Date - 2021-04-18T05:34:02+05:30 IST