సచివాలయ భవనాలపై నివేదిక ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-02-06T06:10:34+05:30 IST

నగరంలో అద్దె ప్రాతిపదికన ఉన్న వార్డు సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణాల కొరకు ప్రభుత్వ భవనాలు లేదా స్థలాలు అన్వేషించి మూడు రోజుల్లో నివేదిక అందించాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు.

సచివాలయ భవనాలపై నివేదిక ఇవ్వాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న కమిషనర్‌

గుంటూరు(కార్పొరేషన్‌), ఫిబ్రవరి 5: నగరంలో అద్దె ప్రాతిపదికన ఉన్న వార్డు సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణాల కొరకు ప్రభుత్వ భవనాలు లేదా స్థలాలు అన్వేషించి మూడు రోజుల్లో నివేదిక అందించాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు. జీఎంసీ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.    సచివాలయాల పక్కా భవన నిర్మాణాలు మొదటి అంతస్తులో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ, స్కూల్‌, ప్రభుత్వ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించాలన్నారు. సచివాలయాల పరిధిలోనే సచివాలయ భవనాలను ఎంపిక చేయాలని తెలిపారు. నోడల్‌ ఆఫీసర్స్‌కి ఓరియంటేషన్‌ కార్యక్రమంలో కమిషనర్‌ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో సమగ్ర అభివృద్ధికి ఆయా కార్యదర్శులు కృషి చేయాలన్నారు.  సమావేశంలో అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఈ రవికృష్ణరాజు, డిప్యూటీ కమిషనర్లు డీ శ్రీనివాసరావు, బీ శ్రీనివాసరావు, డీసీపీలు సత్యనారాయణ, హిమబిందు  తదితరులు పాల్గొన్నారు. 

వీధి కుక్కల కోసం వ్యాక్సిన్‌ థియేటర్‌


నగరంలో పెరిగిపోతోన్న వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌, వ్యాక్సిన్‌ చేయించేందుకు త్వరలో ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్‌ తెలిపారు. వీధి కుక్కలకు సంబంధించి యాంటీ బర్త్‌ కంట్రోల్‌, యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ మోనిటరింగ్‌పై కమిషనర్‌ చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.  

Updated Date - 2021-02-06T06:10:34+05:30 IST