ఓటీఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-12-19T05:47:41+05:30 IST
జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్) పథకం లబ్ధిదారుల దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు.
![ఓటీఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921121912161368/12192021001734n11.gif)
సచివాలయ తనిఖీలో కలెక్టర్ వివేక్యాదవ్
గుంటూరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్) పథకం లబ్ధిదారుల దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బుడంపాడు 195వ వార్డు సచియాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల పరిష్కారాన్ని మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి ఉద్యోగులకు అవసరమైన సూచనలు అందించాలన్నారు. కార్యక్రమంలో తూర్పు మండల తహసీల్దారు శ్రీకాంత్, నగరపాలక సంస్థ డీసీ వెంకటకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.