ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి: రావెల

ABN , First Publish Date - 2021-09-03T18:14:40+05:30 IST

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగు జాతి నాగరికతను విచ్చిన్నం చేసేందుకు తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ నేతే రావెల కిషోర్ బాబు మండిపడ్డారు.

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి: రావెల

గుంటూరు: ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగు జాతి నాగరికతను విచ్చిన్నం చేసేందుకు తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ నేత రావెల కిషోర్ బాబు మండిపడ్డారు.  తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం  కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని డిమాండ్ చేశారు. సాకేంతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే చేస్తున్నారని తెలిపారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసే ఏ కార్యక్రమాన్నైనా బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-09-03T18:14:40+05:30 IST