మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , First Publish Date - 2021-03-08T05:44:39+05:30 IST
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఫ్లయిటెక్ ఏవియేషన్ సీఈవో కెప్టెన్ మమత అన్నారు.
ఫ్లయిటెక్ ఏవియేషన్ సీఈవో మమత
విజయపురిసౌత్, మార్చి 7: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఫ్లయిటెక్ ఏవియేషన్ సీఈవో కెప్టెన్ మమత అన్నారు. ఏవియేషన్ ఉమెన్ పైలెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆదివారం స్థానిక బాలికల గురుకుల కళాశాల, సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇటీవల రెజ్లింగ్ పోటీలో జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థినులను అభినందించి కిట్స్ను అందించారు. పాఠశాల లైబ్రరీకి పుస్తకాలను అందజేశారు. సినీనటి, ట్రైనీ పైలెట్ అపోలో శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థినులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. తొలిప్రేమ, టెంపర్, పఠాస్ తదితర చిత్రాల్లో నటించి ప్రస్తుతం పైలెట్ శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, ఎయిర్ ఇండియా సీనియర్ పైలెట్ సప్న, మోనా, శ్రీదేవి, మంజు తదితరులు పాల్గొన్నారు.