గణపవరంలో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-06-20T05:22:14+05:30 IST
మండలంలోని చవిటిపాలెంలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగుచూసింది. ఓ ఇంట్లోని బీరువా పగలగొట్టి సుమారు రూ.1.5లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
నాదెండ్ల, జూన్ 19: మండలంలోని చవిటిపాలెంలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగుచూసింది. ఓ ఇంట్లోని బీరువా పగలగొట్టి సుమారు రూ.1.5లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చవిటిపాలేనికి చెందిన కావూరు మోహనరావు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం వినుకొండలో ఉంటున్న అతని కుమారుడి వద్దకు వెళ్లాడు. అక్కడినుంచి శనివారం చవిటిపాలెంలోని తన ఇంటికి శనివారం రాగా చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్ఐ కె.సతీష్లు ఇంటిని పరిశీలించి బాధితుడు మోహనరావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.