గుండెపోటుతో ఏఎస్ఐ అక్బర్ మృతి
ABN , First Publish Date - 2021-08-11T05:21:19+05:30 IST
పాతగుంటూరు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ అక్బర్(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
![గుండెపోటుతో ఏఎస్ఐ అక్బర్ మృతి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081011493488/08102021235117n71.gif)
గుంటూరు(కార్పొరేషన), ఆగస్టు 10: పాతగుంటూరు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ అక్బర్(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా ఆయన పాతగుంటూరు పోలీస్ స్టేషనలో విధులు నిర్వహిస్తున్నారు. గత రాత్రి నైట్ డ్యూటీలో భాగంగా రక్షక వాహనంలో తిరగుతుండగా గుండెపోటు వచ్చింది. కాకానిరోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్బర్ మృతిపట్ల పాతగుంటూరు సీఐ కె.వాసు సంతాపం వ్యక్తం చేశారు.