చోరీ కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-30T04:39:35+05:30 IST

తెలంగాణ, ఆంధ్ర రాషా్ట్రల్లో వివిధ చోరీలకు పాల్పడిన గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన అచ్చి చిన సైదారావును అరెస్టు చేసినట్టు డీఎస్పీ విజయ భాస్కరరావు శుక్రవారం తెలిపారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్టు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ విజయ భాస్కరరావు

నరసరావుపేట లీగల్‌, అక్టోబరు 29: తెలంగాణ, ఆంధ్ర రాషా్ట్రల్లో వివిధ చోరీలకు పాల్పడిన గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన అచ్చి చిన సైదారావును అరెస్టు చేసినట్టు డీఎస్పీ విజయ భాస్కరరావు శుక్రవారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని రావిపాడు గ్రామంలో గత నెల 9న విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శివన్నారాయణ గృహంలో జరిగిన చోరీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఈనెల 29న పట్టణంలోని రైల్వేస్టేషన వద్ద  సైదారావును అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.60 లక్షలు నగదు, 350 గ్రాములు బంగారం, 60 గ్రాముల వెండి, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో రూరల్‌ సీఐ అచ్చయ్య, ఎస్‌ఐలు బాల నాగిరెడ్డి,  శ్రీహరి, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌, కానిస్టేబుల్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సిబ్బందికి రివార్డు కొరకు సిఫార్స్‌ చేశామని ఆయన తెలిపారు.  

Updated Date - 2021-10-30T04:39:35+05:30 IST