AP: రైతుల మహాపాదయాత్రకు నేతల సంఘీభావం

ABN , First Publish Date - 2021-11-05T16:00:46+05:30 IST

అమరాతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పలు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.

AP: రైతుల మహాపాదయాత్రకు నేతల సంఘీభావం

గుంటూరు: అమరాతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పలు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.  ఐదో రోజు పాదయాత్రలో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్ కట్టుబడ్డి ఉందని  జేడీ శీలం స్పష్టం చేశారు. అలాగే టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులతో కలసి ధూళిపాళ్ల పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు ప్రత్తిపాడులో రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. గింజుపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎద్దులతో రైతులకు స్వాగతం పలికారు. అమరావతి నినాదాలతో  పలు పాఠశాలల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. 

Updated Date - 2021-11-05T16:00:46+05:30 IST