AP: ఐదవ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-05T13:13:00+05:30 IST

రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది.

AP: ఐదవ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

గుంటూరు: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. తిక్కిరెడ్డిపాలెం నుంచి ఐదవ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. తిక్కిరెడ్డి పాలెం నుంచి పెదనందిపాడు వరకు యాత్ర సాగనునుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఐదవ రోజు పాదయాత్ర కొనసాగనుంది. నాలుగు రోజులలో 54 కిలోమీటర్ల వరకు రైతులు పాదయాత్రగా నడిచారు. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు  పాల్గొంటున్నాయి. 

Updated Date - 2021-11-05T13:13:00+05:30 IST