3 నుంచి బీసీ కులాల జనగణన సాధనా ఉద్యమం
ABN , First Publish Date - 2021-12-31T05:57:32+05:30 IST
దేశంలో ఓబీసీ కులాల జనగణన చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి నుంచి ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వరకు మహా ఉద్యమం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
గుంటూరు, డిసెంబరు 30: దేశంలో ఓబీసీ కులాల జనగణన చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి నుంచి ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వరకు మహా ఉద్యమం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఉద్యమంలో భాగంగా గురువారం గుంటూరులో నగర అధ్యక్షుడు ఉప్పుటూరి పేరయ్య, దొంతా బ్రహ్మం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ నుంచి ట్రావెలర్స్ బంగ్లా సెంటర్లోని పూలే విగ్రహం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం బీసీల పట్ల మొండివైఖరి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులాల జనగణన చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్, నాయకులు పరసా రంగనాఽథ్, గోనుగుంట్ల బ్రహ్మానందశర్మ, ముప్పన వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, బాలయ్య, యామా మురళీ, బాదుగున్నల శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.