రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-02T05:41:07+05:30 IST
జాతీయరహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి మృతి చెందాడు.
మృతుడు ప్రకాశం జిల్లా వాసి
యడ్లపాడు, మార్చి 1: జాతీయరహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశంజిల్లా పొన్నలూరు మండలం చిన్నిపాడుకు చెందిన షేక్ మస్తాన్(43) సెంట్రింగ్ మేస్ర్తీగా పనిచేస్తుంటాడు. పనుల నిమిత్తం సోమవారం స్వగ్రామం నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తిమ్మాపురం గ్రామ పరిధిలోగల ఐటీసీ గోడౌన్ సమీపానికి రాగానే వెనుకగా అదే మార్గంలో వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని అధిగమించించే క్రమంలో ప్రమాదం జరిగింది. దీనితో మస్తాన్ బైక్పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.