రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-08T05:46:52+05:30 IST
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కోటప్పనగర్ సమీపంలో పెరుమాళ్లపల్లి మేజర్ కాలువ చప్టా వద్ద ఆదివారం చోటు చేసుకుంది.
వినుకొండటౌన్, మార్చి 7: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కోటప్పనగర్ సమీపంలో పెరుమాళ్లపల్లి మేజర్ కాలువ చప్టా వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కోటప్పనగర్కు చెందిన ఆచంట శివ వినుకొండకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతున్నాడు. ఆ సమయంలో మేజర్కాలువ వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ప్రియాంక, ఒక కుమారుడు ఉన్నారు.