1న ఫ్యాప్టో ర్యాలీ, బహిరంగసభ
ABN , First Publish Date - 2021-08-28T04:57:32+05:30 IST
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో, సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన గుంటూరులో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ సీహెచ్ సుధీర్బాబు తెలిపారు.
![1న ఫ్యాప్టో ర్యాలీ, బహిరంగసభ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082711262621/08272021232637n93.gif)
గుంటూరు, ఆగస్టు 27: సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో, సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన గుంటూరులో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ సీహెచ్ సుధీర్బాబు తెలిపారు. గుంటూరులోని ఎస్టీయూ భవన్లో శుక్రవారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామన్న సీఎం మాటను నిలుపుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ కె.బసవలింగారావు, కె.నరసింహారావు, కళాధర్, పెదబాబు, నగేష్, తిరమలరెడ్డి, రత్తయ్య తదితరులున్నారు.