యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-01-17T06:32:06+05:30 IST

రాజమహేంద్రవరం ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో పాత నేరస్తుడైన ఒక యువకుడిని కొంతమంది అతిదారుణంగా హత్యచేశారు.

యువకుడి దారుణ హత్య

8 ఒంటి పై 30 కత్తిపోట్లు 8 పాతకక్షల నేపథ్యంలో దారి కాచి పొడిచిన నేరగాళ్లు

రాజమహేంద్రవరం సిటీ,జనవరి  16: రాజమహేంద్రవరం ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో పాత నేరస్తుడైన ఒక యువకుడిని కొంతమంది అతిదారుణంగా హత్యచేశారు. త్రీటౌన్‌ పోలీసులు కథనం ప్రకారం ఆదెమ్మ దిబ్బకు చెందిన కంచిపాటి సతీష్‌ (25) రాడ్‌బెండ్‌ పనులు చేసుకుంటున్నాడు. ఇతను పాత నేరస్తుడు. అయితే శక్రవారం రాత్రి ఒక బైక్‌ విషయంలో సతీష్‌తో అదే ప్రాంతానికి చెందిన దుర్గప్రసాద్‌ అలియాస్‌ బుడ్డా, పండు, వీరబాబు, పోతురాజు, సాయిలు గొడవపడ్డారు. వీరికి పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మళ్లీ ఆదెమ్మదిబ్బ సమీపంలో సతీష్‌తో వారు గొడవపడి కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో సతీష్‌ ఒంటిపై 30 పోట్లు వరకు దిగాయి. సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సతీష్‌ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. బుడ్డా బ్లేడ్‌ బ్యాచ్‌కి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు, గ్రూపుల మధ్య అధి పత్య పోరులో బాగంగా ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతోంది.




Updated Date - 2021-01-17T06:32:06+05:30 IST