దిశ యాప్‌ మహిళలకు రక్షణ కవచం

ABN , First Publish Date - 2021-10-29T05:51:10+05:30 IST

దిశ యాప్‌ మహిళలకు రక్షణ కవచమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు.

దిశ యాప్‌ మహిళలకు రక్షణ కవచం
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత 

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 28: దిశ యాప్‌ మహిళలకు రక్షణ కవచమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రాజెక్టులో భాగంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా న్యాయసేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో కోర్టులో జరిగిన కార్యక్రమంలో దిశ యాప్‌, బైక్‌లు నడిపే వారు హెల్మెట్‌ ధరించాల్సిన అవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. దిశ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో జరిగిన ఈ సదస్సులో దిశ యాప్‌, హెల్మెట్‌ ధరిచడం, అంశాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. కోర్టులో పనిచేస్తున్న సిబ్బందికి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూష్‌ కుమారి, దిశ డీఎస్పీ టి.తిరుమలరావు, సీఐ గౌస్‌బేగ్‌, ట్రాఫిక్‌ సీఐ రమణి, దిశ ఎస్‌ఐ జి.శ్రావణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:51:10+05:30 IST