సాంకేతిక పద్ధతులు అవలంభించాలి
ABN , First Publish Date - 2021-07-09T05:28:34+05:30 IST
పెద్దాపురం, జూలై 8: పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించాలని పశుసంవర్థకశాఖ ఏడీ వై.శ్రీనివాసరావు సూచించారు. మండల పరిధిలోని కట్టమూరులో కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్తో సమకూర్చిన

పెద్దాపురం, జూలై 8: పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించాలని పశుసంవర్థకశాఖ ఏడీ వై.శ్రీనివాసరావు సూచించారు. మండల పరిధిలోని కట్టమూరులో కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్తో సమకూర్చిన స్ట్రాబేలర్ యంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుసంవర్థకశాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శించారు. పశువైద్యులు డాక్టర్ రాకేష్, డాక్టర్ నవీన్, కోటేశ్వరరావు, సత్యనారాయణ, రిలయన్స్ ఫౌండేన్ ప్రాజక్ట్ మేనేజర్ బర్రే నాగేశ్వరరావు, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం, ఉప సర్పంచ్ బండారు చంటిబాబు పాల్గొన్నారు.