వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట
ABN , First Publish Date - 2021-12-26T05:43:41+05:30 IST
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజనం పోటెత్తారు. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు.

ఆత్రేయపురం,
డిసెంబరు 25: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం
భక్తజనం పోటెత్తారు. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన అశేష భక్తజనం స్వామివారిని
దర్శించుకున్నారు. వేకువజామునే గోదావరి జలాలతో స్వామివారిని అభిషేకించి
పుష్పాలతో అలంకరించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి
సేవాకాలం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయ మాఢవీధుల్లో ఏడు
ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల ద్వారా గోవిందనామస్మరణతో
స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, కానుకలు సమర్పించుకుని మొక్కులు
తీర్చుకున్నారు. వేలాది మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి
ఒక్కరోజు రూ.8,21,746 ఆదాయం లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు
తెలిపారు.