కువెంపు జాతీయ పురస్కారానికి తెలుగు రచయిత్రి సత్యవతి ఎంపిక

ABN , First Publish Date - 2021-12-15T07:06:36+05:30 IST

ప్రముఖ తెలుగు రచ యిత్రి పీ సత్యవతి 2021 సంవత్స రానికిగాను కువెంపు జాతీయ పుర స్కారానికి ఎంపికయ్యారు.

కువెంపు జాతీయ పురస్కారానికి తెలుగు రచయిత్రి సత్యవతి ఎంపిక

బెంగళూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు రచ యిత్రి పీ సత్యవతి 2021 సంవత్స రానికిగాను కువెంపు జాతీయ పుర స్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 29న కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కుప్పళ్లిలో జరిగే మహాకవి కువెంపు జయంతి కార్యక్ర మంలో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పుర స్కారం అందజేసి గౌరవించనున్నా రు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, వెండిపతకం అందజేస్తారు. కాకినాడకు చెందిన సత్యవతి తన కథలు, నవలల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని, సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవ లను గుర్తించి ఈ పురస్కారం కోసం ఎంపిక చేశామని కువెంపు ట్రస్టు అధ్యక్షుడు ప్రముఖ సాహితీవేత్త హంప నాగరాజయ్య బెంగళూరులో మంగళవారం ఆంధ్రజ్యోతికి చెప్పారు. పురస్కార ఎంపిక కమిటీలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ కే శ్రీనివాసరావ్‌, ప్రముఖ రచయిత ఘట్టమరాజు అశ్వత్థనారాయణ, నాట క రంగ కళాకారుడు కేవై నారాయణ స్వామి తదితర ప్రముఖులున్నారు.



Updated Date - 2021-12-15T07:06:36+05:30 IST