‘సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి’
ABN , First Publish Date - 2021-07-25T05:25:51+05:30 IST
సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు రైతులకు అవగాహన కల్పించడం ద్వారా తక్కువఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా కృషి చేయాలని ఆత్మ పీడీ జ్యోతిర్మయి అన్నారు.

రాయవరం, జూలై 24: సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు రైతులకు అవగాహన కల్పించడం ద్వారా తక్కువఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా కృషి చేయాలని ఆత్మ పీడీ జ్యోతిర్మయి అన్నారు. రాయవరంలో వ్యవసాయ సహాయకులకు శనివారం శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. అనపర్తి ఏడీఏ డీవీ కృష్ణ, వ్యవసాయ అధికారి కె.ప్రభాకర్, జిల్లావనరుల కేంద్రం ఇన్ఛార్జ్ డీడీఏ మాధవి పాల్గొన్నారు.