విగ్రహాల ధ్వంసం మంచి సంస్కృతి కాదు
ABN , First Publish Date - 2021-02-06T06:00:31+05:30 IST
నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, చెప్పుల దండలు వేసి అవమానించడం మంచి సంస్కృతి కాదని రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు.

- కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 5: నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, చెప్పుల దండలు వేసి అవమానించడం మంచి సంస్కృతి కాదని రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. శుక్రవారం స్థానికంగా తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దోసకాయలపల్లిలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ నాయకులు రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సేవలు అందజేసి ఉన్నతస్థాయికి చేరుకుంటారని, అటువంటి నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమని అన్నారు. కాగా విగ్రహం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ దిమ్మ బలంగా లేకపోవడంతో విగ్రహం కూలి ఉంటుందని కొందరు స్థానికులు చెబుతున్నారని, అయినా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ నాళం రోశయ్య పాల్గొన్నారు.