బోనం ఎత్తిన శ్రీరంగపట్నం
ABN , First Publish Date - 2021-07-28T05:57:09+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో జరిగే బోనాల పండుగ మాదిరిగా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో కూడా బోనాలు సమర్పించారు.
కోరుకొండ,
జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో జరిగే బోనాల పండుగ మాదిరిగా కోరుకొండ మండలం
శ్రీరంగపట్నంలో కూడా బోనాలు సమర్పించారు. పూర్వం నుంచి ఇక్కడ మోదకొండమ్మ
అమ్మవారికి బోనాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. దీంట్లో భాగంగా వారం
రోజుల పాటు నిర్వహించే బోనాల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
రెండు వేల మంది మహిళలు బోనం ఎత్తుకుని గ్రామమంతా తిరిగి అమ్మవారికి
సమర్పించారు. గ్రామ సర్పంచ్ మద్దాల అమ్మాజీ, మద్దాల రమణ, సొసైటీ మాజీ
అధ్యక్షుడు అత్తిలి రాంప్రసాద్, సూరిశెట్టి భద్రం, సూరిశెట్టి కుటుంబరావు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి శక్తి వేషాలతో కళాకారులు వివిధ
కళారూపకాలను ప్రదర్శించారు.