కాకినాడలో ‘సంక్షేమ దివస్‌’

ABN , First Publish Date - 2021-10-29T05:30:00+05:30 IST

కాకినాడ క్రైం, అక్టోబరు 29: జిల్లా పోలీసుల సమస్యల పరిష్కారం కోసం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు శుక్రవారం సంక్షేమ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి అర్జీలు స్వీకరించారు. మహిళా

కాకినాడలో ‘సంక్షేమ దివస్‌’
మహిళా కానిస్టేబుల్‌ నుంచి అర్జీ స్వీకరిస్తున్న ఎస్పీ

కాకినాడ క్రైం, అక్టోబరు 29: జిల్లా పోలీసుల సమస్యల పరిష్కారం కోసం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు శుక్రవారం సంక్షేమ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి అర్జీలు స్వీకరించారు. మహిళా పోలీసులు, సిబ్బందికి చెందిన సర్వీసు సమస్యలు, సంక్షేమం, పదోన్నతులు, బదిలీలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పరిపాలన అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-10-29T05:30:00+05:30 IST